అగ్ర నటుడు చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ని పూర్తి చేసుకున్నది.
సోమవారం నుంచి మూడో షెడ్యూల్ని కూడా అనిల్ రావిపూడి మొదలుపెట్టారు. హైదరాబాద్లో మొదలైన ఈ షెడ్యూల్లో చిరు, నయనతారలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట. ఇందులో శంకర్ ప్రసాద్గా ‘ఘరానా మొగుడు’ నాటి వింటేజ్ చిరంజీవిని ఆడియన్స్ చూస్తారని, చిరంజీవి మార్క్ ైస్టెలిష్ కామెడీ, మాస్ ఎమోషన్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయని చిత్రబృందం చెబుతున్నది. కేథరిన్ థెరిసా, మాస్టర్ రేవంత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల.