శ్రవణ్, మలైకా టి వాసువల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోరా-లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం మోషన్ పోస్టర్ను అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఇప్పటివరకు రానటువంటి విభిన్నమైన కథతో ఈ లవ్స్టోరీని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు. అనుష్క లూహార్, యామిని, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రుప్ప గోపీకృష్ణ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, రచన-దర్శకత్వం: మంగా శ్రీనివాస్.