తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (2026) అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీ పడ్డాయి. మన ప్యానెల్ నుంచి సి.కల్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, దామోదర ప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఎంపికయ్యారు.
ఏషియన్ సునీల్, మోహన్గౌడ్, మైత్రీ రవి, నిరంజన్ రెడ్డి, డి.ఎస్.రావు, పద్మిని, శివలెంకకృష్ణ ప్రసాద్, దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్.కె.గౌడ్, నయీం కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు. ఈ ఎన్నిల్లో మన ప్యానెల్ నుంచి అత్యధిక మంది సభ్యులు విజయం సాధించారు. కార్యదర్శి పదవి అంశంపై కోర్టు కేసు నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ ఫలితాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు అప్పగించనున్నారు. ఈ నెల 8వ తేదీన కార్యదర్శి ఎన్నికల ఫలితాన్ని వెల్లడించనున్నారు.