మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇటీవల వరుస ప్రాజెక్టులు ప్రకటించగా, ఒక్కో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా, ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రారంభించింది. చిరంజీవి కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నట్టు సమాచారం.
చిరంజీవి తన సినిమాలను భారీ సినిమాగా మార్చేస్తున్నారు. పాటలు, ఫైట్లు ఒకటి కాదు.. ఈ సినిమాలో బడా స్టార్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ కూడా నటించే అవకాశం ఉందని వార్తలు రాగా, ఇప్పుడు బ్రిట్నీ స్పియర్తో ఓ పాట పాడించాలని అనుకుంటున్నారట.ఇదే నిజమైతే మూవీకి భారీ క్రేజ్ రావడం ఖాయంగా కనిపిస్తుంది.
మరోవైపు చిరంజీవి భోళా శంకర్ అనే సినిమా చేస్తుండగా, ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తిసురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగా తమన్నా ఎంపికైనట్టు తెలిసింది. ‘గాడ్ఫాదర్’ విషయంలోనూ పలువురు పేర్లు వినిపించినా, అందులో చిరుకి జోడీగా కథానాయిక కనిపించదట. ఇక బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా కోసం ఇప్పటికే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాని సంప్రదించిన విషయం తెలిసిందే. మరి ఆమెనే ఖాయమవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.