Boyapati sreenu remunaration| టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్గా తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలను చేస్తూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ఈయన సినిమాల్లో యాక్షన్ అంశాలతో పాటు సెంటిమెంట్ సీన్లు పుష్కలంగా ఉంటాయి. తాజాగా బాలయ్య బాబుతో తెరకెక్కించిన అఖండ సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఫైనల్గా అఖండ చిత్రం 22కోట్ల ప్రాఫిట్ను సాధించింది. అఖండ తర్వాత ఈయన అల్లు అర్జున్తో సినిమా చేయాల్సి ఉంది. కానీ బన్నీ పుష్ప-2 ను పూర్తి చేశాకే తన తదుపరి సినిమాను చేయనున్నాడు. ఈ గ్యాప్లో బోయపాటి శ్రీను, రామ్పోతినేనితో సినిమాను మొదలు పెట్టనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అఖండ తర్వాత బోయపాటి రేంజ్ పెరిగిపోయింది. తాజాగా రామ్తో తెరకెక్కించనున్న ప్రాజెక్ట్కు హీరో రామ్ 10కోట్ల పారితోషకం తీసుకోగా బోయపాటి శ్రీను ఏకంగా 12కోట్ల పారితోషకాన్ని తీసుకోనున్నాడట. అంటే రామ్ కంటే 2కోట్లు ఎక్కవే బోయపాటికి ముట్టనుంది. దానికి తగ్గట్టే బోయపాటిశ్రీను కూడా స్క్రీప్ట్, ప్రీ ప్రొడక్షన్ విషయాలలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడట .ఇక ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. ఇస్ట్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో వరుస హిట్లను సాధించిన రామ్ ది వారియర్తో హ్యట్రిక్ను సాధించే పనిలో ఉన్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది.