అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ (ఎవరు ఎక్కడ ఎందుకు). కెవీ గుహన్ దర్శకుడు. డా॥ రవి.పి.రాజు దాట్ల నిర్మాత. ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే అందాన్ని..వెన్నెల తెరపై చూశానే..’ అనే గీతాన్ని శనివారం విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్నందించిన ఈ పాటను యాజిన్ నిజార్ ఆలపించారు. సైమన్కింగ్ స్వరాల్ని స్వరకర్త. దర్శకుడు మాట్లాడుతూ ‘తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నాం. వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది’ అన్నారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు చిత్రంలో నటిస్తున్నారు.