Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆదివారం ఎపిసోడ్ పూర్తి స్థాయిలో డ్రామా, ఎమోషన్స్తో నిండిపోయింది. రాము రాథోడ్ స్వయంగా హౌస్ను వీడిన తర్వాత కూడా మరో ఎలిమినేషన్ జరగడం షాక్ ఇచ్చింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బాటమ్లో ఉన్న సాయి సీజన్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఈ వారం దివ్య, సుమన్ శెట్టి రెబల్స్గా హౌస్లో సీక్రెట్ టాస్క్లు చేశారు. వారి దొంగతనాలు, అల్లరి వీడియోలను నాగార్జున ప్రదర్శించారు. ముఖ్యంగా సుమన్ శెట్టి నటన అందరినీ ఆకట్టుకుంది. పాల ప్యాకెట్ దొంగతనం తర్వాత అమాయకంగా నటిస్తూ హౌస్మేట్స్ను మోసం చేసిన విధానం ప్రేక్షకులను, నాగ్ను కూడా ఇంప్రెస్ చేసింది.
నాగార్జున, కంటెస్టెంట్స్ను విడివిడిగా పిలిచి టైటిల్ గెలవడానికి ఎవరు దగ్గరగా ఉన్నారు? ఎలిమినేషన్కు ఎవరు దగ్గరలో ఉన్నారు? అని అడిగారు. అందరి అభిప్రాయాల ప్రకారం తనూజ, ఇమ్మాన్యుయేల్ టైటిల్కు చేరువగా ఉన్నారని తేలింది. ఇద్దరికీ తలా 5 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో భరణి, సాయి ఎలిమినేషన్ జోన్లో ఉన్నారని అందరూ పేర్కొన్నారు. నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్లో చివరికి భరణి, సాయి మిగిలారు. గార్డెన్ ఏరియాలో వీరిద్దరి ముందు రెండు బొమ్మ ట్రైన్స్తో టాస్క్ సెటప్ సిద్ధం చేశారు. ఎవరి ముందు ట్రైన్ టన్నెల్ నుంచి బయటకు రాకుండా ఆగిపోతే, ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని నాగ్ తెలిపారు. చివరికి సాయి ట్రైన్ ఆగిపోవడంతో, అతను ఎలిమినేట్ అయ్యాడు.
తనూజ వద్ద ఉన్న గోల్డెన్ బజర్ను ఉపయోగిస్తే సాయి సేఫ్ అవుతాడు, భరణి అవుట్ అవుతాడు అని నాగార్జున ప్రకటించారు. కానీ తనూజ ఆ అవకాశాన్ని వదులుకుంది. దీంతో సాయి ఎలిమినేట్ కాగా, భరణి మరోసారి ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఎపిసోడ్తో బిగ్ బాస్ హౌస్లో ఫైనల్ రేస్కి సంబంధించిన క్లారిటీ వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నాగార్జున మాటలతో తనూజ, ఇమ్మాన్యుయేల్ ఫైనలిస్టులుగా ఉండే సూచనలున్నాయని భావిస్తున్నారు. మొత్తం మీద, ఈ వారాంతం ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 9లో అత్యంత ఆసక్తికరమైన మలుపుగా మారింది.