Amitabh Bachchan | బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. భారత గాన కోకీల లతా మంగేష్కర్ 2024 అవార్డును ఈ ఏడాది అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్లు లతమంగేష్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన అమితాబ్కు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.
2022 ఫిబ్రవరి 6న లతమంగేష్కర్ మరణించిన విషయం తెలిసిందే. లత జ్ఞాపకార్థం 2022 నుంచి ఆమె కుటుంబసభ్యులు ఈ అవార్డును ప్రారంభించారు. ఇందులో భాగంగానే 2022లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. గత ఏడాది ఆశా భోస్లేకు ఇచ్చారు. ఇక ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు. మరోవైపు భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా దీననాధ్ మంగేష్కర్ పురస్కారానికి ఎంపికయ్యాడు.