అంజి వల్గమాన్, సాయిప్రసన్న, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్ చెప్పాల దర్శకుడు. బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపల్లి నిర్మాతలు. ఈ నెల 23న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్య కథాంశమిది.
సహజమైన భావోద్వేగాలతో సాగుతుంది. చక్కటి హాస్యంతో నవ్విస్తుంది. ఓ మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఆ సంఘటన ఆధారంగా నియో రియలిజం అనే జోనర్లో ఈ సినిమాను తెరకెక్కించాం. రెండు గంటల పాటు పల్లె వాతావరణాన్ని కళ్లముందుంచుందీ చిత్రం’ అన్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్నందించారు.