భానుచందర్, సీత, మచ్చా రామలింగారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ప్రత్యక్ష దైవం షిర్డిసాయి’. ఈ చిత్రాన్ని దత్త ఫిలింస్ నిర్మాణంలో మచ్చా రామలింగారెడ్డి నిర్మించారు. దర్శకుడు కొండవీటి సత్యం రూపొందించారు. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘ఈ చిత్రంతో సాయితత్వాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నాం. యువతలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నాం’ అన్నారు.