Kartikeya | కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు హీరో కార్తికేయ. ఆయన తాజా చిత్రం ‘భజే వాయువేగం’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. బుధవారం హీరో కార్తికేయ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు అందులోని ఎమోషన్స్కు బాగా కనెక్ట్ అయ్యాను. హీరోగా నాకు సామాజిక బాధ్యత ఉండాలని భావిస్తాను. ఆ కోణంలో ఈ సినిమా ఇన్స్పైరింగ్గా ఉంటు ంది.
ఓ యువకుడు ఓ ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించే ప్రయత్నాలు ఏమిటన్నదే ఈ చిత్ర కథ. హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, లవ్ అన్ని అంశాలుంటాయి’ అన్నారు. హీరోగా రాణిస్తున్న సమయంలో గ్యాంగ్లీడర్, వాలిమై చిత్రాల్లో విలన్ పాత్రలు చేయడంపై కార్తికేయ స్పందించారు. ‘ఈ విషయంలో నేను ఏరోజు బాధపడలేదు. ‘గ్యాంగ్లీడర్’ చిత్రం ద్వారా అమెరికా ఆడియెన్స్కు కూడా చేరువయ్యాను. అజిత్తో చేసిన ‘వాలిమై’ ద్వారా తమిళంలో గుర్తింపు దక్కింది. ఆ సినిమా తర్వాతే నేను ైస్టెలిష్ మేకోవర్తో సినిమాలు చేయడం మొదలుపెట్టా. ‘భజే వాయువేగం’ దర్శకుడు ప్రశాంత్ రెడ్డితో మరో చిత్రాన్ని చేసే ఆలోచన ఉంది’ అన్నారు.