విదార్థ్, ధృవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భగత్సింగ్నగర్’. వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్నారు. వాలాజా క్రాంతి దర్శకుడు. ఈ చిత్రంలోని ‘యుగ యుగమైన తరగని వేదన’ అనే గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. భగత్సింగ్నగర్లో జరుగుతున్న అన్యాయాలపై ఓ సామాన్యుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. బెనర్జీ, రవిప్రకాష్, మునిచంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజేష్ పీటర్, కల్యాణ్ సమి.