దీక్షిత్శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ఎమ్ దర్శకుడు. బృందా ఆచార్య కథానాయికగా నటిస్తున్నది. హెచ్ కె ప్రకాష్ నిర్మాత. గురువారం ఈ సినిమాలోని ‘హర ఓం..’ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. జుదాన్ శ్యాండీ స్వరపరచిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు.
బతుకుపై ఆశను తెలియజేస్తూ ఆధ్యాత్మిక భావాలతో ఈ పాట సాగింది. ‘ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. వినూత్నమైన కాన్సెప్ట్తో రూపొందిస్తున్న కామెడీ థ్రిల్లర్ ఇది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జుధాన్ శ్యాండీ, రచన-దర్శకత్వం: అభిషేక్ ఎమ్.