Band Melam | టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో, సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బ్యాండ్ మేళం’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
ట్రైలర్ గమనిస్తే, ఇది ఒక పక్కా పల్లెటూరి నేపథ్య ప్రేమకథగా కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి బావ, మరదల్లా కలిసి పెరిగిన గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) మధ్య ఏర్పడిన అనుబంధం, ఆ తర్వాత చోటుచేసుకున్న అపార్థాలు, సంగీతం చుట్టూ తిరిగే కథాంశం ఆసక్తికరంగా ఉన్నాయి. వినోదం, ఎమోషన్స్ మరియు విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.