విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మొదటి సారి సౌత్లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటిస్తున్న సినిమా అవ్వడంతో తెలుగు మరియు తమిళ ఆడియన్స్లో అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి.
ఇటీవల చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ప్రభుత్వ బస్సులోనే జనం అంతా ఉండగా షూటింగ్ చేశారు. ఇందులో హీరో హీరోయన్లు ఫుట్ బోర్డింగ్ చేస్తూ నిల్చున్నారు. ఇక సమంత, నయనతార దాదాపు ఒకే రకమైన లుక్కులో ఉన్నారు. వీడియో అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.
30 ఏళ్ల క్రితం కమల్హాసన్, అమల జంటగా సురేశ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన తమిళ చిత్రం ‘సత్య’ (1988)లోని ‘వళయోసై గలగలవెన…’ (గాజుల సవ్వడి గలగలమంటూ…) పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇళయరాజా సంగీతం శ్రోతలని ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఈ సాంగ్ను రీ క్రియేట్ చేశారు దర్శకుడు విఘ్నేష్ శివన్. ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా కోసం రీ క్రియేట్ చేయగా, కొత్త వెర్షన్లో విజయ్ సేతుపతితో పాటు సమంత, నయన కనిపించనున్నారు.
పాత పాటలో అమలో ఏ చీర కట్టుకుందో ఇప్పుడు కొత్త వర్షెన్లో సమంత, నయనతార అలాంటి చీరనే కట్టుకోబోతున్నారు. అప్పటి పాటలో కమల్–అమల బస్సులో ఫుట్బోర్డ్ జర్నీ చేస్తారు. తాజా పాటలో కూడా ఆ సీన్ ఉంది. ఈ పాట ప్రేక్షకులకి కొత్త అనుభూతి ఇస్తుందని అంటున్నారు.