రామ్ కార్తీక్, ప్రిష జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘ఔను నేనింతే’. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. నాగేశ్వరరావు దర్శకత్వంలో జీవీ చౌదరి, నాగరాజు చిర్రాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి నటుడు పృథ్వీ క్లాప్ నివ్వగా, మరో నటుడు అనీష్ కురువిళ్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర సమర్పకులు యం.ఎ సత్తార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కమర్షియల్ అంశాలతో పాటు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే అంశాన్ని ఈ చిత్రంలో చర్చిస్తున్నాం. తప్పకుండా చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె.