శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకుడు. మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నిన్ను చూడకుండా మనసు ఆగదే’ అనే పాటను శుక్రవారం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి విడుదలచేశారు. డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను యాజిన్ నిజార్, మాళవిక ఆలపించారు. ‘నిర్మల్ జిల్లాలోని కడెం అందాలు నన్ను ఆకట్టుకున్నాయి’ అని మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదలచేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.