అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘యానై’. రాధికా శరత్కుమార్, యోగిబాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషించారు. హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘ఏనుగు’ పేరుతో తెలుగులోకి వస్తున్నది. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహినీ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్ కుమార్ తెలుగు రాష్ర్టాల్లో జూలై 1న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికెట్ అందుకుంది. సినిమా గురించి నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ..‘సినిమా చూసిన సెన్సార్ సభ్యులు బాగుందంటూ అభినందించారు. ఈ చిత్రంలో భావోద్వేగాలతో పాటు కుటుంబ విలువలు ఆకట్టుకుంటాయి. అలాగే ఆద్యంతం వినోదాన్ని అందిస్తుంది. దర్శకుడు హరి ఓ మంచి కథతో మన ముందుకొస్తున్నారు.’ అన్నారు.