టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అయితే కోలీవుడ్ మన్మథుడు అరవింద్ స్వామి అని చెబుతారు. బొంబాయి, మెరుపు కలలు, నవాబ్, ఓకే బంగారం వంటి చిత్రాలతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ నటుడు ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కూడా నటిస్తున్నాడు. ఆ మధ్య రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాలో విలన్ పాత్ర పోషించి రక్తి కట్టించాడు. ప్రయోగాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న అరవింద్ స్వామి ఇప్పుడు ఆరు విభిన్న గెటప్స్లో కనిపించేందుకు సిద్ధమయ్యాడట.
సెల్వ దర్శకత్వం వహిస్తున్న వనంగముడి లో అరవింద్ స్వామి ఏకంగా ఆరు విభిన్న గెటప్ లలో కనిపిస్తాడని తెలిసింది.. వాస్తవానికి ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్ లో మేకర్స్ ఈ లుక్స్ ని ప్రేక్షకులకు అందించారు.ఈ చిత్రంలో అరవింద్ స్వామి అన్బజగన్ పాత్రలో నటించారు. ఒక పోలీసు అధికారి జీవితాన్ని ఈ పాత్ర ఆవిష్కరిస్తుంది. పాత్రలకోసం అరవింద్ స్వామి ఎంతో శిక్షణ తీసుకున్నాడు.అలానే ఆహార విషయంలోను కఠినంగా ఉన్నాడు.
పోలీస్ కథగా చిత్రంగా రూపొందుతుండగా, ఇందులో అరవింద్ స్వామి పాత్ర తన తెలివితేటలతో కేసుని చేధించే పాత్ర. ఈ సినిమా అతని కెరీర్ లో ముఖ్యమైన సినిమా అవుతుందని మేకర్స్ అంటున్నారు.ఈ చిత్రంలో సిమ్రాన్, రితికా సింగ్, నందిత శ్వేత, చాందిని,తంబి రామయ్య, జయప్రకాష్ తదితరులు నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించగా గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు.