SSMB28 Movie | మహేష్బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘SSMB28’ చేస్తున్నాడు. 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. గతంలో వీళ్ల కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు కమర్షియల్గా భారీ విజయాలు సాధించకపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఇక మూడో సారి ఈ కాంబో సెట్ అవడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఎర్పడ్డాయి. యాక్షన్ ఎపిసోడ్తో షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్రం.. ఇప్పటివరకు మరో షెడ్యూల్ ప్రారంభించలేదు. దీంతో సినిమా ఆగిపోయిందని పలు వార్తలు పుట్టుకొచ్చాయి.
మహేష్బాబు కథలో కొన్ని చేంజెస్ చేయమని త్రివిక్రమ్కు సూచనలు ఇచ్చాడట. అంతేకాకుండా థమన్ పట్ల కూడా కొంచెం అసహనంగానే ఉన్నట్లు తెలుస్తుంది. థమన్ ప్లేస్లో అనురుధ్ను తీసుకోవాలని మహేష్ అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ తీవ్ర విషాదంలో ఉన్నాడు. ఇప్పుడప్పుడే షూటింగ్లో పాల్గొనే అవకాశాలు లేవు. దాంతో ఈ చిత్రం మరింత ఆలస్యం కానుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. మహేష్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.