Chiranjeevi | చిరంజీవికి ద్విపాత్రాభినయాలు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ‘నకిలీ మనిషి’ నుంచి ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ వరకూ ఓ పదకొండు సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడిందంతా దేనికంటే.. మళ్లీ ఆయన రెండు పాత్రలతో తెరపై మెరవనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్లో ఓ వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు చిరంజీవి.
ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేయనున్నారట. ఈ రెండు పాత్రలూ దేనికదే విభిన్నంగా ఉంటాయట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. అనిల్ టీమ్ స్క్రిప్ట్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా అనిల్ మార్క్ కామెడీతో ఈ స్క్రిప్ సిద్ధం అవుతున్నదట. ఈ కథకు చిరంజీవి కూడా బాగా కనెక్ట్ అయ్యారని తెలుస్తున్నది. చాలాకాలం తర్వాత చిరంజీవి చేస్తున్న గొప్ప కామెడీ సినిమా ఇదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి కామెడీ సెన్స్కి అనిల్ కామెడీ తోడైతే థియేటర్లలో నవ్వుల వరదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.