అభిమానం అనేది హద్దుల్లో ఉన్నంత వరకు మాత్రమే బాగుంటుంది. ఒక్కసారి అది హద్దులు దాటిందంటే మాత్రం అస్సలు బాగోదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా గురించి ఏం చెప్పాలి..? మూడేళ్ళ తర్వాత వచ్చాడు కదా అని పవన్ కళ్యాణ్ అభిమానులు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర వాళ్లు చేస్తున్న హంగామా చూసి అంతా పిచ్చెక్కిపోయి గోల చేస్తున్నారు. ఏకంగా నిర్మాత దిల్ రాజు కూడా థియేటర్ లో అన్నీ మరిచిపోయి పేపర్లు ఎగరేసాడు. అంతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ అభిమాని చేసిన ఓ పని చూసి అంతా షాక్ అయిపోయారు. అదే రక్తంతో పవర్ స్టార్ పేరు రాయడం. అది కూడా థియేటర్ లో సినిమా నడుస్తున్న సమయంలో స్క్రీన్ పై ఆయన పేరును అభిమాని రక్తంతో రాసాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఎవడ్రా వీడు.. ఇలా ఉన్నాడు.. అభిమానం మరీ పిచెక్కిపోయింది.. ఆపండ్రా వాన్ని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన అభిమానులు ఇదిరా పవన్ కళ్యాణ్ అంటే కాలర్స్ ఎగరేస్తున్నారు. కానీ దీనిపై యాంకర్ అనసూయ భరద్వాజ్ మాత్రం సీరియస్ అయింది. ఏంటిది.. పిచ్చిపిచ్చిగా ఉందా అంటూ రెచ్చిపోయింది జబర్దస్త్ యాంకర్. ఇలాంటి పనులు చేసి ఎందుకురా మీ తల్లిదండ్రులను బాధ పెడుతుంటారు అంటూ అనసూయ ఫైర్ అయింది. ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఒక్కసారి ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇది మరీ దారుణంగా ఉంది.. ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నపుడు చుట్టుపక్కల వాళ్లు ఏం చేస్తున్నారు.. వాడిని ఆపకుండా వేడుక చూస్తున్నారా అంటూ సీరియస్ అయింది ఈమె. అభిమానం అనేది హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది.. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించారా.. అభిమానం చాటుకోవడానికి ఎన్నో దారులున్నాయి. కొంచెం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అందరికీ బాగుంటుందంటూ వార్నింగ్ ఇచ్చింది అనసూయ భరద్వాజ్. ఇప్పటికీ హీరోల కోసం ఇలా రక్తాలు చందిస్తారా పిచ్చి కాకపోతే అంటూ నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు