Anasuya Bharadwaj in Bheeshma parvam | యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ఇండస్ట్రీలో అదిరిపోయే ఇమేజ్ ఉంది. కేవలం బుల్లితెర పై మాత్రమే కాకుండా సినిమాలు కూడా చేసుకుంటూ రెండు చోట్ల బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి బ్రేకులు లేకుండా కెరీర్ విజయవంతంగా కొనసాగించవచ్చని అనసూయను చూస్తుంటే అర్థమైపోతుంది. పక్కాగా ప్లాన్ చేసుకుంటూ చేతి నిండా సంపాదిస్తుంది ఈ భామ. అలాగే అవకాశాలు కూడా అనసూయను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇన్ని రోజులు కేవలం తెలుగు ఇండస్ట్రీపై మాత్రమే ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పక్క ఇండస్ట్రీలపై కూడా కన్నేసింది.
ఈ క్రమంలోనే ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఫ్లాష్ బ్యాక్ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి వెళ్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. మరోవైపు మలయాళంలోకి కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది అనసూయ భరద్వాజ్. అక్కడ ఏకంగా మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన భీష్మపర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది అనసూయ. మొన్న మార్చి 4న విడుదలైన ఈ సినిమాకు సంచలన ఓపెనింగ్స్ వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో భీష్మ పర్వం కూడా చేరిపోయింది.
ఇందులో అత్యంత కీలకమైన పాత్ర చేసింది అనసూయ. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 52 కోట్ల గ్రాస్ వసూలు చేసి కేరళ టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది భీష్మ పర్వం. దానికితోడు మమ్ముట్టి లాంటి స్టార్ హీరోతో నటించడంతో అనసూయకు అక్కడ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం మలయాళం నుంచి కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. భీష్మపర్వం తీసుకొచ్చిన ఇమేజ్ కరెక్ట్గా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు తెలుగులో కూడా చిరంజీవి లాంటి అగ్ర హీరోల కాకుండా చిన్న హీరోలతో కూడా నటిస్తోంది అనసూయ భరద్వాజ్. మొత్తానికి ఎటు చూసుకున్న ప్రస్తుతం బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతుంది ఈ జబర్దస్త్ యాంకర్.