అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఫ్రాన్స్లో జరిగే కేన్స్కు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేస్తుంటారు. గతేడాది కేన్స్ రెడ్ కార్పెట్పై ఉత్సాహంగా అడుగులు వేసింది అందాల తార తమన్నా. అయితే ఈసారి తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి జంటగా ఆమె ఈ చిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నది.
ఇప్పటిదాకా తమ మధ్య ఉన్న బంధాన్ని తమన్నా, విజయ్ వెల్లడించలేదు. కేన్స్ చిత్రోత్సవం ఆ సందర్భానికి వేదిక కానుందని చెప్పుకుంటున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఫ్రాన్స్కు వెళుతూ ఎయిర్పోర్ట్ వద్ద కెమెరాల కంట పడ్డారు. ఇటీవలే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు జరగనుంది. భారత్ నుంచి ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ, అదితీ రావ్ హైదరి. సారా అలీఖాన్, మృణాల్ ఠాకూర్, మానుషీ చిల్లర్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వీరితో పాటు తమన్నా, విజయ్ వర్మ కూడా వెళ్తున్నారట.