కథానాయికల ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఒక్కోసారి సినిమాకు మించిన మలుపులు ఉంటాయి. అగ్ర కథానాయిక శృతిహాసన్ లవ్ఎఫైర్ కూడా అలాంటిదేనని చెప్పొచ్చు. చిత్రకారుడు శంతను హజారికాతో ఈ సుందరి రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నది. ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారని చెబుతున్నారు. వివిధ సందర్భాల్లో ఈ ప్రేమికుల జోడీ తీయించుకున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వీరిద్దరు రహస్య వివాహం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయంపై శృతిహాసన్ ప్రియుడు శంతను హజారికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘మా అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కాబట్టి సృజనాత్మకంగా ఇద్దరికీ పెళ్లి జరిగిపోయినట్లుగానే భావిస్తున్నాం. రెండేళ్లుగా మా ప్రయాణం సాగుతున్నది. క్రియేటివ్గా, వృత్తిపరంగా ఎన్నో పనుల్ని ఇద్దరం విజయవంతంంగా పూర్తిచేశాం. మా ఇద్దరి మధ్య పెళ్లి అన్నది కేవలం లాంఛనంగా పూర్తిచేయాల్సిన తంతు మాత్రమే’ అని శంతను హజారికా పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కెరీర్పైనే దృష్టిపెడుతున్నానని, పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తామని శృతిహాసన్ చెప్పింది. ఈ భామ తెలుగులో ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.