Allu Arha | శాకుంతలం సినిమాలో భరతుడిగా ఐదు నిమిషాల పాటు మెరిసింది అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ. సినిమా డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకున్నా అర్హకు మాత్రం మంచి పేరు వచ్చింది. కనిపించింది కాసేపే అయినా.. తన క్యూట్ మాటలు, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. ఇక బిగ్ స్క్రీన్ పై అర్హను చూసి బన్నీ కూడా మురిసిపోయాడు. కాగా ఇప్పుడు అర్హ మరో బిగ్ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ దేవరలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం ఉండటంతో దానికి అర్హని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అర్హకు భారీగానే పారితోషికం ముట్టజేస్తున్నట్లు టాక్.
ఇన్ సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అర్హకు ఈ సినిమా కోసం రూ.20 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారట. దాదాపు పది నిమిషాల పాత్ర కోసం అర్హకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఐదు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ ఐదు షెడ్యూల్స్ లో యాక్షన్ సన్నివేశాలు మాత్రమే తెరకెక్కడం విశేషం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేసే విధంగా మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. మరో వైపు ఈ సారి సోలో హీరోగా పాన్ ఇండియా రేంజ్లో భారీ హిట్టు కొట్టాలని తారక్ సైతం కసిగా ఉన్నాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.