Director Surender Reddy | స్టైలిష్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ సురేందర్ రెడ్డి. ఆయన తొలి సినిమా ‘అతనొక్కడే’ నుంచి సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత ప్రతీ సినిమాకు కమర్షియల్ హంగులు బాగా దట్టిస్తూనే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో అలరిస్తూ వస్తున్నాడు. ‘ధృవ’ తర్వాత దాదాపు మూడేళ్లు సమయం తీసుకుని చిరుతో ‘సైరా’ వంటి భారీ పాన్ ఇండియా సినిమా చేశాడు. బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల సినిమా పోయింది కానీ.. ఇప్పటికీ గొప్ప సినిమాల్లో అదీ ఒకటి. అయితే సురేందర్ రెడ్డి సినిమాల్లో బాగా నిరాశ పరిచిన సినిమా ఏదైనా ఉందంటే అది మొన్న విడుదలైన ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డితో సినిమా అనగానే అఖిల్ జాక్ పాట్ కొట్టేశాడని, అఖిల్ స్టార్ రేంజ్ హీరో అయిపోతాడని అందరూ భావించారు. కానీ కట్ చేస్తే అఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన అక్కినేని ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అనీల్ సుంకర సైతం ఎలాంటి భేషాజాలకు పోకుండా సినిమా ఫేయిల్యూర్ ను ఒప్పుకున్నాడు. ఇక అదే టైమ్ లో పూర్తి స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టామని బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో సురేందర్ రెడ్డి టార్గెట్ అయ్యాడు. ఈ సినిమా ఫేయిల్యూర్కు పూర్తి బాధ్యత సురేందర్ రెడ్డిదే అన్న మాటలు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి. ఇక సురేందర్ రెడ్డి కూడా సినిమా విడుదలయ్యాక ఎక్కడ కనిపించలేదు. ఫుల్ సైలెంట్ అయిపోయాడు. ఇక సురేందర్ రెడ్డికి అవకావాలు రావడం కష్టమే.. ఒకవేళ వచ్చిన దానికి చాలా సమయం పడుతుందని అనుకుంటున్న సమయంలో పాత ముచ్చట ఒకటి బయటకు వచ్చింది.
రామ్ చరణ్ ధృవ సమయంలో సరేందర్ రెడ్డి.. అల్లు అరవింద్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. అప్పటికీ ఆయన చేతిలో స్టోరీ కూడా లేదు. కేవలం మాట మీదే అడ్వాన్స్ ఇచ్చేశాడు అల్లు అరవింద్. కాగా తాజాగా ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కాబోతుందని గట్టిగా వినిపిస్తుంది. అయితే అది ధృవ సీక్వెల్ మాత్రం కాదు. పైగా రామ్ చరణ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. దాంతో వేరే హీరోతో గీతా ఆర్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తుంది. లోలోలపలే పలువురు హీరోలను కూడా చిత్ర యూనిట్ కలుస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైమైనా అంతటి డిజాస్టర్ తర్వాత కూడా సురేందర్ రెడ్డికి మరో సినిమా ఆఫర్ వచ్చిందంటే విశేషమే.