AK 63 | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) ప్రస్తుతం తిరుమేని డైరెక్షన్లో VidaaMuyarchi సినిమా చేస్తున్నాడని తెలిసిందే. షూటింగ్ దశలో ఉంది. కొన్ని రోజుల క్రితం అజిత్ కుమార్ టీం అజర్బైజాన్లో ల్యాండై.. నాన్స్టాప్ షూటింగ్లో పాల్గొన్నది. కాగా ఈ మూవీ సెట్స్పై ఉండగానే కొత్త సినిమా ఏకే 63 (AK 63)కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పూజా కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు. చిత్రీకరణ మార్చి లేదా ఏప్రిల్లో షురూ కానుంది.
ఫ్యాన్ బాయ్ నుంచి వస్తున్న ఈ సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో పడ్డట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. తాజా వార్తల ప్రకారం అజిత్ కుమార్ బరువు తగ్గే పనిలో ఉన్నాడట. గతేడాది మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. టబు ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నాడు.
2025 పొంగళ్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరోవైపు AK 64 సినిమాను విడుదలై ఫేం వెట్రిమారన్ డైరెక్ట్ చేయబోతున్నాడన్న అప్డేట్ కూడా ఇప్పటికే అజిత్ కుమార్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేస్తోంది. VidaaMuyarchi లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్గా నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.
Exclusive : #AK63 Today 💥💥💥
Follow For @MovieTamil4
Director #AadhvikRavichandran Next Film AjithKumar Lead Role #AK63 Confirmed 👍 This Project Pooja Today Chennai
Shooting From March End / April Month Start Movie Release Plan To 2025 Pongal 🎯
Director -… pic.twitter.com/necqn6XcT5
— Movie Tamil (@MovieTamil4) January 15, 2024