అల్లు అర్జున్ తాజా చిత్రం ‘రాకా’ నిర్మాణ దశ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫాంటసీ మూవీలో దీపికా పడుకోన్తో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ కథానాయికలుగా నటిస్తున్నారని తెలిసింది. కథావిస్తృతి దృష్ట్యా నలుగురు నాయికలకు చోటుందని చెబుతున్నారు. తాజాగా ‘రాకా’ ప్రపంచంలోకి మలయాళ భామ ఐశ్వర్యలక్ష్మి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
పూర్తి నెగెటివ్ షేడ్స్తో ఆమె పాత్ర సాగుతుందని, కథాగమనంలో కీలకంగా ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ప్రెస్టీజియస్ సినిమా కావడం, దర్శకుడు అట్లీ తన పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చడంతో ఐశ్వర్యలక్ష్మి లేడీ విలన్గా కనిపించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. త్వరలో హైదరాబాద్లో ‘రాకా’ కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం ఐశ్వర్యలక్ష్మి తెలుగులో ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో నాయికగా నటిస్తున్నది.