Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్నది. రామాయణం ఆధారంగా చిత్రం తెరకెక్కుతున్న రాముడి పాత్రలో ప్రభాస్, సీతపాత్రలో కృతి సనన్ కనిపించనున్నది. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన టీజర్ను అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చిత్రం టీజర్పై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సినిమాలో రాముడి పాత్రతోపాటు హనుమంతుడు రావణాసురుడి పాత్రలను పూర్తిగా మార్చేశారని, రామాయణాన్ని అవమానించారంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా చిత్రంపై వచ్చిన విమర్శలపై బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ స్పందించింది. ‘భేదియా’ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా.. ‘ఆదిపురుష్’ వివాదంపై ప్రశ్నించించగా.. ఇది మనమందరం చాలా గర్వించదగ్గ చిత్రమని తెలిపింది. అయితే ఎవరూ టీజర్ను చూసి సినిమాను అంచనా వేయొద్దని సూచించింది. చిత్రాన్ని గ్రాండ్గా అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్తో మీ ముందుకు తీసుకురాబోతున్నామని, డైరెక్టర్ ఓం రౌత్ అద్భుతంగా చిత్రాన్ని తెరక్కించారని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఇంకా మరింత మెరుగ్గా తీసుకువచ్చేందుకు సినిమా విడుదలను కొద్దిరోజుల పాటు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
మన పురాణాలను చరిత్రలను ప్రపంచానికి తెలిపేందుకు ఇదో అద్భుతమైన అవకాశం అని తెలిపింది. ప్రస్తుతం కృతి సనన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆది పురుష్ జూన్ 16, 2023న విడుదల కానున్నది. ఇంతకు ముందు సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించినా చివరకు చిత్రంలో వాడిన వీఎఫ్ఎక్స్పై వచ్చిన విమర్శలతో వెనక్కినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసేందుకు చిత్రం విడుదలను వాయిదా వేసినట్లు భావిస్తున్నారు.