Adah Sharma | బాలీవుడ్ హీరోయిన్ ఆదా శర్మ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంటుంది. గతేడాది ‘ది కేరళ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామ ఈ ఏడాది ‘బస్తర్’ మూవీతో మరో హిట్ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ తాజాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ ధరకు ఈ ఇంటిని ఆదా శర్మ దక్కించుకుబోతున్నట్లు పలు కథనాలు వెలుబడ్డాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఆదాశర్మ స్పందించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆదా శర్మ.. మీరు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటిని కొనుగోలు చేస్తున్నారా.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్లు రాయడం, మాట్లాడటం కరెక్ట్ కాదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గొప్ప నటుడు. మంచి సినిమాలు తీశారు. సుశాంత్ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. సుశాంత్ ఇంటిని నేను కొనడానికి వెళ్లలేదు. కేవలం చూడడానికి మాత్రమే వెళ్లాను. కానీ మీడియా నేను కొనుగోలు చేస్తున్నట్లు రాసింది. ఒకవేళ ఇల్లు కొనాలి అనుకుంటే ముందు మీడియా వాళ్ళకి చెబుతా అప్పటివరకు వెయిట్ చేయండి. ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో ఉన్న అందుకే ఇల్లు అవసరం లేదు అంటూ ఆదా శర్మ వెల్లడించింది.