బాలీవుడ్ నటి దియా మీర్జాకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. మూడు గంటల పాటు విమానంలో చిక్కుకుపోయానని, ఆ సమయంలో తనకు ఎలాంటి సహాయం అందలేదంటూ ట్విట్టర్ ద్వారా ఆవేదన వెలిబుచ్చింది. బాలీవుడ్ బ్యూటీతో పాటు పలువురు ప్రయాణికులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి ముంబై నుంచి ఢిల్లీకి విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన యూకే 940 బయలుదేరింది. తర్వాత విమానాన్ని మళ్లించి జైపూర్లో ల్యాండ్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి దియామీర్జా ట్విట్టర్ వేదిక ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
శనివారం తెల్లవారుజామున ట్వీట్ చేసింది. ‘ఢిల్లీకి వెళ్లాల్సిన యూకే 940ను దారి మళ్లించి జైపూర్లో ల్యాండ్ చేశారు. విమానం లోపలే మూడు గంటలపాటు వేచి ఉన్నాం. ఆ తర్వాత ఫ్లయిట్ క్యాన్సిల్ అయినట్టు, కిందకు దిగిపోండని చెప్పారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ కానీ.. విస్తారా కానీ ఎలాంటి సాయం చేయలేదు. అడిగిన దానికి బదులు కూడా ఇవ్వలేదు. మా బ్యాగులు ఎక్కడ? అని ఆమె ట్వీట్లో ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఫ్లయిట్ను జైపూర్లో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని శుక్రవారం రాత్రి విస్తారా ట్విట్టర్ ద్వారా తెలిపింది.
దియా మీర్జాతో పాటు పలువురు ప్రయాణికులు సైతం ట్వీట్లు చేశారు. జైపూర్లో రాత్రి 11 గంటల సమయంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. ఉదయం 2.15 గంటల వరకు విమానంలోనే ఉండిపోయాం. తర్వాత విమానం రద్దయిందని, ఢిల్లీ చేరుకునేందుకు ఎవరికి వారే సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు’ అంటూ ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దియా మీర్జా ‘ధక్ ధక్’ చిత్రంలో నటిస్తున్నది. షూటింగ్ ఢిల్లీలో ప్రారంభమైంది. చిత్రంలో ఫాతిమా సనా షేక్, రత్న పాఠక్ షా, సంజనా సంఘీ ప్రధాన పాత్రలో పోషిస్తుండగా. వయాకామ్ 18, తాప్సీ పన్ను ప్రొడక్షన్ హౌస్, అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official
— Dia Mirza (@deespeak) May 20, 2022