రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. కొద్ది రోజుల క్రితం ఫస్ట్ థండర్ పేరుతో విడుదల చేసిన యాక్షన్ వీడియోకు మంచి స్పందన లభించింది. రామ్ నటిస్తున్న 20వ చిత్రమిది కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తాజా అప్డేట్ను హీరో రామ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ైక్లెమాక్స్ అదిరిపోయేలా వచ్చిందని చెప్పారు.
‘24 రోజుల పాటు ైక్లెమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించాం. ఇది ైక్లెమాక్స్ కాదు..అంతకుమించి ఉంటుంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దర్శకుడు బోయపాటి సినిమాల్లో పోరాట ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్ని రొమాంచితంగా డిజైన్ చేస్తారని ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ తాజా అప్డేట్ ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.