విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. అనన్యపాండే కథానాయిక. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా వినూత్నరీతిలో ప్రచార కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల ముంబైలోని ఓ మాల్ జరిగిన ప్రమోషనల్ ఈవెంట్కు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడం సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచింది. తాజాగా ‘లైగర్’ చిత్రబృందం అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ఫాదర్’ సెట్ను సందర్శించింది. ప్రస్తు తం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతున్నది. స్పెషల్ సెట్లో చిరంజీవి, సల్మాన్ఖాన్లపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.
‘లైగర్’ బృందానికి స్వాగతం పలికిన చిరు, సల్మాన్ఖాన్ వారికి శుభాకాంక్షలందజేశారు. రమ్యకృష్ణ, అనన్యపాండే, రోనిత్రాయ్, విషురెడ్డి, అలీ, మకరంద్దేశ్పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్జోహార్, అపూర్వ మోహత, దర్శకత్వం: పూరి జగన్నాథ్.