దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ప్రధాన తారాగణం పాల్గొనగా 25రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్ పూర్తయిందని చిత్రబృందం పేర్కొంది.
విజయ్ 66 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నది. 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. ప్రభు, శరత్కుమార్, ప్రకాష్రాజ్, జయసుధ, శ్రీకాంత్, యోగిబాబు, సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని, సంభాషణలు, అడిషినల్ స్క్రీన్ప్లే: వివేక్, సహనిర్మాతలు: హర్షిత్రెడ్డి, హన్షిత, కథ, స్క్రీన్ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.