హైదరాబాద్, అక్టోబర్ 11: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ ప్లాంట్కు ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) గుర్తింపు లభించింది. దీంతో బాచుపల్లి వద్దగల ఈ అతిపెద్ద ఔషధ తయారీ కేంద్రం.. గ్లోబల్ లైట్హౌజ్ నెట్వర్క్ (జీఎల్ఎన్)లో చేరిం ది.
100కుపైగా తయారీదారుల సమూహమే ఈ జీఎల్ఎన్. ‘మా హైదరాబాద్ ప్లాంట్కు డిజిటల్ లైట్హౌజ్ ఫ్యాక్టరీగా గుర్తింపు రావడం.. మా ప్రయాణంలో ఓ కీలక మైలురాయి’ అని రెడ్డీస్ తయారీ విభాగం గ్లోబల్ హెడ్ సంజయ్ శర్మ అన్నారు.