హైదరాబాద్, అక్టోబర్ 14: సౌత్ ఇండియా షాపింగ్మాల్ ప్రస్తుత పండుగ సీజన్లో దృష్టిలో పెట్టుకొని ‘ఆల్ న్యూ ఫెస్టివ్ కలెక్షన్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ పేరుతో సరికొత్త విక్రయాలకు శుభారంభం చేసింది. దసరా, దీపావళి సందర్భంగా వచ్చే నెల 17 వరకు లక్కీడ్రా, బంపర్ డ్రాలను నిర్వహిస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో 35 కార్లు గెలుచుకునే అవకాశం సంస్థ కల్పించింది. ఈ నెల 28న నిర్వహించనున్న దసరా బంపర్డ్రాలో 20 కార్లు, నవంబర్ 11న నిర్వహించనున్న దీపావళి బంపర్ డ్రాలో 15 కార్లు గెలుచుకోవచ్చును. తెలంగాణలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూంలో కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ స్కీంలో పాల్గొనే అవకాశం కల్పించింది.
ఈ ప్రత్యేక స్కీంలో 2,500 మంది విజేతలకు రూ.5 కోట్ల విలువైన బహుమతులు అందచేయనున్నట్టు పేర్కొంది. వీటిలో లక్కీడ్రాలో 35 ఆల్టో కార్లు, 100 గ్రాముల 600 వెండి గ్లాస్లు, 600 టీసీఎల్ 32 ఇంచుల టీవీలు, 600 వెట్ గ్రైండర్లు, 665 ఫైర్బోల్ట్ స్మార్ట్ వాచ్లు ఉన్నాయి. నవంబర్ 11 వరకు ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేతనే వీక్లీ డ్రా తీసి, విజేతల పేర్లు ప్రకటిస్తున్నది సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే రూ.500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేసిన వారికి లక్కీడ్రా కూపన్ అందిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ షోరూంలలో సరికొత్త చీరలు, మెన్స్వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చూడీదార్స్, లెహంగాస్, లెగ్గింగ్స్, గౌన్లు వంటి దుస్తులు విక్రయిస్తున్నది.