న్యూఢిల్లీ, నవంబర్ 28: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కొత్త ప్రెసిడెంట్గా విజేందర్ శర్మ ఎన్నికయ్యారు. పార్లమెంట్ చట్టం కింద ఏర్పడిన ఈ ఇనిస్టిట్యూట్కు 2022-23 సంవత్సరానికి వైస్ ప్రెసిడెంట్గా రాకేశ్ భల్లా నియమితులయ్యారు. సోమవారం విడుదలలైన ఒక ప్రకటన తెలిపింది. నవంబర్ 28న ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక నిర్వహించినట్లు ఐసీఏఐ తెలిపింది.
ఈ సంస్థ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో పనిచేస్తుంది. లా గ్రాడ్యుయేట్ అయిన విజేందర్ శర్మ 1998 నుంచి కాస్ట్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2017 నుంచి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా వ్యవహరిస్తున్నారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన రాకేశ్ భల్లా ఐసీఏఐ ఫెలో మెంబర్గా కొనసాగుతున్నారు.