న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్లు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించాయి.
ఈ ప్రాజెక్టుల కింద డిజిటల్ పద్ధతిలో కిసాన్ క్రెడిట్ కార్డులను ఇవ్వనున్నారు. దీంతో భూ రికార్డుల అవసరం ఉండబోదు. బ్యాంక్ లకు రైతులు రావాల్సిన పనీ లేదు.