ముంబై : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల బాట పట్టాయి. దీంతో పలు టెక్ సంస్థల షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. సెన్సెక్స్ 0.83శాతం అంటే 474.34 పాయింట్లు పెరిగి 57,894.58 వద్ద, నిఫ్టీ 0.86శాతం అంటే 146.20 పాయింట్లు పెరిగి 17,232.50 వద్ద కొనసాగుతున్నది. 2413 షేర్లు పెరగగా, 621 షేర్లు క్షీణించాయి. 84 షేర్లు స్థిరంగా ఉన్నాయి.
టెక్ మహీంద్రా,ఇన్ఫోసిస్,ఎల్అండ్టీ,హెచ్సీఎల్ టెక్, ఎన్టీపీసీ,యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్,విప్రో,పవర్గ్రిడ్,ఎస్బీఐ,ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.