న్యూఢిల్లీ: వేతన జీవులు ఆదాయంపై పన్ను మినహాయింపు కోసం ప్రణాళిక రూపొందించుకుం టారు. మీరు పన్ను భారాన్ని తగ్గించుకోవాలంటే ద్రవ్య లభ్యతతోపాటు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ను బట్టి ఆప్షన్లు ఖరారు చేసుకోవాలి.
అందుబాటులో ఉన్న పలు పథకాలను పరిశీలించాలి. ఆయా పథకాలపై వచ్చే వడ్డీరేట్లు, ఆర్థిక లక్ష్యాలు, వయస్సు, రిస్క్ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని సరైన పథకాన్ని ఎంచుకోవాలి.. అందుబాటులో ఉన్న పన్ను రహిత పెట్టుబడి పథకాలు పరిశీలిద్దాం..
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)లో పెట్టుబడులపై వచ్చే వడ్డీ మీద పన్ను రాయితీ ఉంటుంది. ఆదాయం పన్ను చట్టం (ఐటీ)లోని 80సీ సెక్షన్ కింద పీపీఎఫ్ పెట్టుబడులకు పన్ను బెనిఫిట్లు లభిస్తాయి.
పీపీఎఫ్ల్లో వడ్డీరేటు ఎక్కువ
దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) కంటే పీపీఎఫ్ పెట్టుబడులపై అధిక వడ్డీరేటు లభిస్తుంది. పీపీఎఫ్పై వడ్డీరేటు ఏడాదికి 7.10 శాతం వడ్డీరేటు లభిస్తుంది.
పీపీఎఫ్కు 15 ఏండ్ల లాక్ ఇన్ పీరియడ్
అయితే, పీపీఎఫ్లో పెట్టుబడులు పెట్టే ముందు.. ఈ పొదుపు స్కీమ్ దీర్ఘకాల పెట్టుబడి ఇన్స్ట్రుమెంట్ అని గుర్తుంచుకోవాలి. దీని లాక్ పీరియడ్ 15 ఏండ్లు ఉంటుంది. భారీ మొత్తంలో కార్ఫస్ ఫండ్ కావాలంటే ప్రతి ఒక్కరికీ పీపీఎఫ్ మంచి పన్ను రహిత పెట్టుబడి ఆప్షన్ అవుతుంది.
వీపీఎఫ్లో వేతన జీవులకే ఆప్షన్
వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్ (వీవీఎఫ్) అంటే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ ఇది. ఇది సభ్యుల స్వచ్ఛంద కంట్రిబ్యూషన్ పథకం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులుగా ఉన్న వేతన జీవులకు మాత్రమే పెట్టుబడి పెట్టే పథకం.
వీవీఎఫ్లో ఉద్యోగులు ఎంత మదుపు చేస్తారన్న దానితో సంబంధం లేకున్నా.. వారి కనీస వేతనంలో 12 శాతానికి మించరాదు. ప్రస్తుతం వీపీఎఫ్లో వడ్డీరేటు 8.50 శాతం ఆఫర్ చేస్తున్నది.
వీపీఎఫ్లో పెట్టుబడులకు 80సీ కింద పన్ను రాయితీ
80సీ సెక్షన్ కింద వీపీఎఫ్లో పెట్టుబడులు పన్ను మినహాయింపు కిందకు వస్తాయి. ఈపీఎఫ్ మాదిరిగానే వీవీఎఫ్ కూడా పన్ను మినహాయింపు.. ఏడాదిలో రూ.2.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పెట్టుబడిపై వడ్డీకి పన్ను రాయితీ లభిస్తుంది.
ప్రభుత్వ రంగ సంస్థలు నిధుల సేకరణకు పన్ను రహిత బాండ్లు జారీ చేస్తాయి. హడ్కో, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ఆర్సీ) ఈ బాండ్లను ఇష్యూ చేస్తాయి.
ప్రస్తుతం ప్రభుత్వ బాండ్లన్నీ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్టెడయి ఉన్నాయి. ఉదాహరణకు ఐఆర్ఎఫ్సీ జారీ చేసే పన్ను రహిత బాండ్పై 8.65 శాతం వడ్డీ లభిస్తుంది.
పెట్టుబడులకు మరో వేదికగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యూలిప్స్) నిలిచాయి. ఈ బీమా ప్రణాళికలు ప్రీమియం చెల్లింపుపై 10 రెట్లు బీమా అందిస్తాయి.
ఆదాయం పన్ను శాఖ (ఐటీ)లోని 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవ చ్చు. ఈ పథకాలకు ఐదేండ్ల వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.
వివిధ బ్యాంకుల్లో పొదుపు ఖాతాల్లో రూ.10వేలు జమ చేశారనుకోండి. ఈ పెట్టుబడిపై వచ్చే వడ్డీ మీద పన్ను రాయితీ ఉంటుంది. వడ్డీరేటు చాలా తక్కువ. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో రూ.10 లక్షల పైచిలుకు పెట్టుబడిపై ఆరు శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు.
అతి తక్కువ కాలంతో కూడిన లాక్ ఇన్ టెన్యూర్ స్కీమ్ కావాలంటే పోస్టాఫీసుల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్సీ) బెటర్. వీటి లాకిన్ పీరియడ్ ఐదేండ్లు. ఎన్ఎస్సీలో పెట్టుబడులపై ఐటీ చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రతి త్రైమాసికంలోనూ వడ్డీరేటు మారొచ్చు.
ప్రస్తుతం ఎన్ఎస్సీలో మదుపుపై 7.9 శాతం వడ్డీ లభిస్తున్నది. ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.7 నుంచి ఏడు శాతం వడ్డీ లభిస్తుంది.