Financial Tasks | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మరో ఐదు రోజుల్లో ముగిసిపోతున్నది. సరిగ్గా ఆరో రోజు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభం అవుతున్నది. వేతన జీవులు, వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు ఆదాయం పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయాలంటే ఈ నెలాఖరులోపు వివిధ పథకాల్లో మదుపు చేయాలి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాల్లో పెట్టుబడులకూ 2024 మార్చి 31 తుది గడువు. అలాగే ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీం కూ ఈ నెలాఖరే తుది గడువు కానున్నది. వాటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఖాతాలు యాక్టివ్గా ఉండాలంటే ఈ నెలాఖరులోగా కనీస మొత్తం డిపాజిట్ చేయడం తప్పనిసరి. మార్చి 31 లోపు డిపాజిట్ చేయని ఖాతాలు ఇన్ యాక్టివ్ అవుతాయి. ఒకవేళ తర్వాత డిపాజిట్ చేయాలన్నా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో కనీసం రూ.500, ఎఎస్వై ఖాతాల్లో రూ.250 తప్పనిసరి డిపాజిట్ చేయాలి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు ఇప్పటి వరకూ పన్ను ఆదా చేయడానికి ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదా.. అయితే, వెంటనే మదుపు చేయండి. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. పీపీఎఫ్, ఎస్ఎస్వై, ఐదేండ్ల ఫిక్స్ డ్ డిపాజిట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో పొదుపు చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను ఆదా చేయొచ్చు.
మీకు కారు ఉందా.. ఇప్పటికీ మీరు మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్ డేట్ చేయలేదా.. అయితే వెంటనే చేసేయండి. ఈ నెలాఖరు తర్వాత కేవైసీ అప్ డేట్ చేయని ఫాస్టాగ్ ఖాతాలను బ్లాక్ లిస్ట్ లోకి పంపడం గానీ, డీయాక్టివేట్ చేయడం గానీ చేస్తారు. మీ ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ సొమ్ము ఉన్నా.. కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే డీయాక్టివేట్ చేస్తారు.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రారంభించిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ ఈ నెలాఖరుతో ముగియనున్నది. సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద ఏటా 7.6 శాతం వడ్డీ, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది. 400 రోజుల గడువుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు.