New Cars Launching | భారత ఆటోమొబైల్ పరిశ్రమకు వచ్చే ఏప్రిల్ చాలా స్పెషల్గా నిలిచిపోనున్నది. వివిధ సెగ్మెంట్లు, వేరియంట్లలో పలు కార్ల ఆవిష్కరణతో మార్కెట్ కింగ్లుగా అవతరించనున్నాయి. ఆ జాబితాలో ఎంజీ మోటార్స్ కొమెట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, లంబోర్ఘిని యురస్ ఎస్, మెర్సిడెజ్ బెంజ్ ఏఎంజీ జీటీ 63 ఎస్ఈ నిలుస్తాయి. ఆయా కార్లలో ఏయే ఫీచర్లు ఉంటాయి.. వాటి ధరలెలా ఉంటాయన్న విషయమై ఓ లుక్కేద్దామా..!
బ్రిటిష్ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే `ఎంజీ కొమెట్` ఈవీ ఆవిష్కరించింది. వచ్చేనెలాఖరులో మార్కెట్లోకి తేనున్నది. ఇండోనేసియాలో వులింగ్ ఎయిర్ ఈవీ పేరుతో ఆవిష్కరించిన ఈ `ఎంజీ కొమెట్ ఈవీ`.. భారత్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులతో రానున్నది. ఎంజీ కొమెట్ ఈవీ కారు 20కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ విత్ 40 బీహెచ్పీ విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న ఈ కారు ఫుల్ చార్జింగ్ చేస్తే 200-250 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కంటే బుల్లి కారు కానున్నది. ఎక్స్ షోరూమ్ ప్రకారం ఎంజీ కొమెట్ ఈవీ కారు రూ.9 లక్షల నుంచి లభిస్తుందని తెలుస్తున్నది.
గత జనవరి ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఫ్రాంక్ ఎస్యూవీ కారు కోసం ఇప్పటికే 13 వేల మందికి పైగా ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకున్నారు. వచ్చేనెలలో ఈ కారు భారత్ రోడ్లపై పరుగులు తీయనున్నదని తెలుస్తున్నది. రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో (1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్స్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్) లభ్యం అవుతుంది. రెండు ఇంజిన్లు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి. ఫ్రాంక్ ఎస్యూవీ కారు ధర వెల్లడించకున్నా.. నెక్సా డీలర్షిప్ల వద్ద రూ.11 వేలు పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. భారత్ మార్కెట్లో దీని ధర రూ.20-25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
ఇటాలియన్ కారు మేకర్ లంబోర్ఘిని తన `యురస్ ఎస్` కారును వచ్చేనెలాఖరులో మార్కెట్లో పరిచయం చేయనున్నది. ఈ ఎస్యూబీ కారు కంపెనీ ఎంట్రీ లెవెల్ కారుగా నిలుస్తుంది. గతేడాది సెప్టెంబర్లోనే యురస్ ఎస్ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు. గ్లోబల్ వేరియంట్లో ఈ కారు ఇంజిన్ 3996సీసీ 8-సిలిండర్ ట్విన్ టర్బో చార్జ్డ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 656 బీహెచ్పీ పవర్, 850 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది. గరిష్టంగా 305 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. 3.5 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. గ్లోబల్ మార్కెట్లో రూ.4.22కోట్లు పలికినా, భారత్ మార్కెట్లో యురస్ కంటే రూ.40-50 లక్షలు తక్కువ ఉండొచ్చునని అంచనా.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చేనెల 11న న్యూ మెర్సిడెజ్ ఏఎంజీ జీటీ 63 ఎస్ఈ మోడల్ కారును ఆవిష్కరిస్తుంది. ఏఎంజీ ప్రొడక్షన్లో అత్యంత శక్తిమంతమైన కారుగా నిలుస్తుంది. 4.0 లీటర్ల ట్విన్ సిలిండర్ టర్బో చార్జ్డ్ వీ8 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 834.5 బీహెచ్పీ గరిష్ట విద్యుత్, 1400 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఎలక్ట్రిక్ మోడ్లో మాత్రమే వస్తున్న కారు ఇది. కేవలం 2.9 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. భారత్లో దీని ధర రూ.1.48 కోట్లు ఉండొచ్చునని అంచనా.