న్యూఢిల్లీ, ఆగస్టు 18: రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ నుంచి నాన్-రెసిడెంట్ కార్పొరేట్లకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మినహాయింపునిచ్చింది. దేశంలో శాశ్వత లేదా స్థిరమైన వ్యాపార స్థలి లేని నాన్-రెసిడెంట్ కార్పొరేట్ సంస్థలకు విదేశీ రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై 5 శాతం టీసీఎస్ నుంచి మినహాయింపునిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.
ఈ మేరకు ఐటీ నిబంధనలకు చేసిన మార్పులను విడుదల చేసింది. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్షన్ 206(1జీ) కింద నాన్-రెసిడెంట్ ఇండివీడ్యువల్స్కు వర్తిస్తున్న మినహాయింపులు ఇకపై నాన్-రెసిడెంట్ కార్పొరేట్లకూ అమలవుతాయని సీబీడీటీ స్పష్టం చేసింది.