న్యూఢిల్లీ, నవంబర్ 19: స్టీల్, ఖనిజ ఎగుమతులపై విధిస్తున్న పన్నును తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఎగుమతులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో గతంలో వీటిపై పన్నును పెంచిన సర్కార్..తాజాగా శనివారం నుంచి అమలులోకి వచ్చేలా పన్నులో కోత విధించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దేశీయ స్టీల్ ఇండస్ట్రీ స్వాగతించింది. ఈ నిర్ణయంతో ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. కానీ, ఆంత్రాసైట్, కోకింగ్ కోల్, ఫెర్రోనికెల్ దిగుమతులపై మాత్రం సుంకాన్ని పెంచింది. వీటిపై దిగుమతి సుంకాన్ని 5 శాతం వరకు అధికం చేసింది. గతంలో ఇది సున్నా శాతంగా ఉండేది. ఈ సుంకంపై నిర్ణయం తీసుకోవడానికి ఈవారం మొదట్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా సమావేశమయ్యారు.