హైదరాబాద్, సెప్టెంబర్ 7: టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏల్) మరో మైలురాయిని సాధించింది. హైదరాబాద్లో ప్లాంట్లో తయారైన 400వ ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్లేజ్ను డెలివరీ చేసింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్, బోయింగ్ జాయింట్ వెంచర్లో ఈ యూనిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రధాన భాగాలు దేశంలో తయారై, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నది.
వీటిని అమెరికా సైన్యానికి , 2025లో దేశీయ సైన్యానికి అందచేసిన ఆరు అపాచీ విమానాల్లో అమర్చారు. హైదరాబాద్లో 52 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేసిన యూనిట్లో 750 మంది ఇంజినీర్లు, టెక్నిషన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంట్లో తయారైన విడిభాగాలను దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్నది. ప్రస్తుతం 19 దేశాల్లో 1,300కి పైగా అపాచీ ఎయిర్క్రాఫ్ట్లు పనిచేస్తున్నాయి.