న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఫుడ్ డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ..నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలను మరింత విస్తరించడానికి రూ.5,250 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. నిత్యావసర వస్తువులను డెలివరీ చేయడానికి ఏర్పాటు చేసిన ఇన్స్టామార్ట్ను గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్తోపాటు 17 నగరాల్లో అందిస్తున్నది.