Startup Mahakumbh : భారత స్టార్టప్ల సదస్సు స్టార్టప్ మహాకుంభ్ తొలి రోజు పరిశ్రమ దిగ్గజాల మార్గదర్శకాలు, అర్ధవంతమైన సెషన్స్తో స్ఫూర్తిమంతంగా సాగింది. మూడు రోజుల పాటు జరిగే స్టార్టప్ మహాకుంభ్ వికసిత్ భారత్ లక్ష్యం సాకారం దిశగా స్టార్టప్ల పాత్రపై ప్యానెల్ డిస్కషన్తో ఈ సదస్సు ఆరంభమైంది. భారత స్టార్టప్లు నిర్వహించాల్సిన కీలక పాత్రపై సుదీర్ఘంగా ఈ చర్చా వేదికలో మంతనాలు సాగించారు.
భారత స్టార్టప్ ఎకోసిస్టమ్కు స్టార్టప్ మహాకుంభ్ లాంఛ్ప్యాడ్లా వ్యవహరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ప్లీనరీ ప్రారంభ సెషన్లో నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, డీపీఐఐటీ కార్యదర్శి రాజీవ్ కుమార్ సింగ్, డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత స్టార్టప్లకు వృద్ధి అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఇందులో ఉపాధి కల్పన కీలకమైన భాగమని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే ప్రముఖ స్టార్టప్ దేశంగా భారత్ ఆవిర్భవించాలనే ఆకాంక్షతో ముందుకు సాగాలని పిలుపు ఇచ్చారు. భారత స్టార్టప్స్ పరోక్షంగా కోటి ఉద్యోగాలు సృష్టించాయని చెప్పారు. స్టార్టప్ మహాకుంభ్ సదస్సును అసోచాం, నాస్కామ్, బూట్స్ట్రాప్ ఇంక్యుబేషన్, టై, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఐవీసీఏ, డీపీఐఐటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. లెన్స్కార్ట్ సీఈవో పీయూష్ బన్సల్, జొమాటో సీఈవోలు సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.
Read More :
IT Raids | చట్నీస్ హోటల్స్పై ఐటీ దాడులు.. యజమాని ఇండ్లలోనూ సోదాలు