న్యూఢిల్లీ, ఆగస్టు 22: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇష్యూ ద్వారా సమకూరిన నిధులు వినియోగం వెల్లడికి సంబంధించిన విధివిధాలను త్వరలో వెల్లడించనున్నట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వార్షిక డైరెక్టర్ల కన్క్లెవ్ 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారదర్శకత అనేది కేవలం ఒక సంస్థ వెల్లడించే సమాచార పరిమాణానికి సంబంధించినది మాత్రమే కాదని, ఆ సమాచారం పెట్టుబడిదారులకు ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడంలో ఎంతవరకు సహాయపడుతుందనే దానికి సంబంధించిందని పేర్కొన్నారు.