Atal Pension Yojana | ఏ వేతన జీవికైనా ఫుష్కలంగా రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ ఉండాలనే కోరిక ఉంటుంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కంట్రీబ్యూషన్ చేస్తుంటారు. ఇక అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం రిటైర్మెంట్ స్కీం ప్రారంభించింది. 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అనే పథకాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ స్కీంలో దాదాపు నాలుగు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) ద్వారా ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తుంది. రిటైర్మెంట్ నాటికి గ్యారంటీ రిటర్న్స్ హామీ ఉంటుంది.